భువనగిరి: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకుని స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు îముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు.
ముఖ్యమంత్రి తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా , కొండా సురేఖ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు.